హుజురాబాద్ తనిఖీల్లో ఇప్పటివరకు దాదాపు 3.50 కోట్ల క్యాష్ స్వాదీనం చేసుకున్నారు. 7 లక్షల విలువైన లిక్కర్ సీజ్ చేశారు. 2 లక్షలకు పైగా విలువైన చీరలు, 10లక్షల విలువైన బంగారం, వెండి, 11 కిలోల గంజాయి, కొంత పేలుడు పదార్థాలను కూడా సీజ్ చేశారు పోలీసులు. 2,284 మందిని తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. వివిధ పార్టీలు 116 కోడ్ ఆప్ కండక్ట్ కింద కేసులు పెట్టినట్టు ప్రకటించింది ఈసీ.