టి20 ప్రపంచకప్ 2021 : దుబాయ్ వేదికగా ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలుత భారత్, రెండో మ్యాచ్లో న్యూజిలాండ్పై గెలిచిన పాకిస్థాన్ తాజాగా దుబాయ్ వేదికగా ఆఫ్గనిస్తాన్తో జరిగిన మూడో మ్యాచ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టింది. ఆఫ్గనిస్తాన్పై పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలిచి ఘన విజయం సొంతం చేసుకుంది.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర అజమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ(51) చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఫకర్ జమాన్(30) పరుగులు చేశాడు. చివర్లో ఆసిఫ్ అలీ సిక్సర్ల వర్షం కురిపించాడు. నాలుగు సిక్సులు బాది పాకిస్తాన్ కు విజయాన్ని ఖాయం చేశాడు. అప్ఘానిస్తాన్ నిర్దేశించిన టార్గెట్ ను పాకిస్తాన్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. అప్ఘానిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. ముజిబుర్ రెహ్మాన్, మహమ్మద్ నబీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీశారు.