సాయి ధరమ్ తేజ్.. గత వినాయక చవితి రోజున ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురయ్యాడు తేజ్. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన సాయి ధరమ్ తేజ్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది… ఆ తర్వాత జూబ్లి హిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తేజ్.. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా దీపావళి సందర్భంగా తన ఫ్యామిలీకి సంబందించిన హీరోలతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. సాయి ధరమ్ తేజ్ గురించి ఆరోగ్యం పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.. చిరంజీవి ట్వీట్ చేస్తూ.. అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికి ఇది నిజమైన పండుగ అంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ మినహా మిగతా మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అకిరానందన్, వైష్ణవ్ తేజ్ హాజరయ్యారు.
అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ. @IamSaiDharamTej pic.twitter.com/DZOepq88ON
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 5, 2021