సత్యదేవ్ మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు. విభిన్న కథాంశాలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ హీరో. నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుస్తున్న మూవీ ‘స్కై లాబ్’. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది.వాస్తవ ఘటనలకు కొద్దిగా హ్యూమర్ టచ్ ఇచ్చి విడుదల చేసిన ఈ ట్రైలర్ నవ్వులు పూయిస్తుంది.
ఈ ట్రైలర్ గురించి మెగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘నేను స్కైలాబ్ ట్రైలర్ చూశాను. చాలా బాగా నచ్చింది. నా స్నేహితుడు సత్యకు అభినందనలు. నిత్యామీనన్గారికి, రాహుల్ రామకృష్ణకి కంగ్రాట్స్. డిసెంబర్ 4న సినిమా విడుదలవుతుంది. సినిమా పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను’’అని అన్నారు.
గ్రామీణ నేపథ్యంలో ఫన్ ఎంటర్ టైన్మెంట్ గా రూపొందిన ఈ మూవీని డిసెంబర్ 4న విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమాతో సత్యదేవ్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.