Bright Telangana
Image default

ఆ షో చేయనంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ?

jr ntr meelo evaru koteeswarudu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో ‘బిగ్ బాస్‌’, ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలకు హోస్టుగా కన్పించారు. ముందుగా హిందీలో ప్రసారమైన ఈ షోను గతంలోనే తెలుగు బుల్లితెరపై “ఎవరు మీలో కోటీశ్వరులు” పేరుతో ప్రసారం చేయగా నాగార్జున, చిరంజీవి హోస్టులుగా కన్పించారు. వాటికి మంచి స్పందనే వచ్చింది. తాజాగా కొంత గ్యాప్ తీసుకుని “ఎవరు మీలో కోటీశ్వరులు” అంటూ ఆ షో పేరును కాస్త మార్చి, అదే గేమ్ ప్లాన్ తో ప్రసారం చేస్తున్నారు. దానికి ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నారు.

ఈ షో ప్రారంభంలో మంచి రేటింగ్ సాధించింది కానీ రానురానూ ఈ షోకు రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. రేటింగ్ ను పెంచడానికి స్టార్స్ ను తీసుకొచ్చినప్పటికీ పెద్దగా ఫలితం కన్పించలేదు. ఇక ఎన్టీఆర్ ఎట్టకేలకు “ఎవరు మీలో కోటీశ్వరులు” షూటింగ్ ముగించారు. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా తాను షోని కంటిన్యూ చేయనని ఎన్టీఆర్ మేకర్స్‌కి చెప్పినట్లు సమాచారం. దీని వెనుక అసలు కారణం ఇంకా తెలియలేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం షోపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్, దేవి శ్రీ ప్రసాద్, ఎస్ఎస్ తమన్ తాజా అతిథులుగా పాల్గొన్న ఎపిసోడ్ లను త్వరలోనే ప్రసారం చేయనున్నారు.

Related posts

Nagarjuna : టికెట్ ధరల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. నాగార్జున

Hardworkneverfail

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ టీజర్‌కు డేట్ ఫిక్స్..?

Hardworkneverfail

Ram Charan – Shankar Movie: RC15లో విలన్‌గా మలయాళ సీనియర్ స్టార్ ..?

Hardworkneverfail

Peddanna Collections: డిజాస్టర్ దిశగా ‘పెద్దన్న’…పెద్దన్న మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail

సల్మాన్ ఖాన్ అభిమానుల పిచ్చి పీక్స్ ..థియేట‌ర్‌లోనే బాణ‌సంచా కాల్చిన ఫ్యాన్స్‌

Hardworkneverfail

Chalapathi Rao : నటుడు చలపతి రావు కన్నుమూత..

Hardworkneverfail