సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయినట్టు తాజా సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్యాకింగ్ రంగంలో జరుగుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుండగా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్తో ‘సర్కారు వారి పాట’ మూవీపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. మొత్తం 15 కోట్లకు ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో డీల్ క్లోజ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫీషియ్గా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాగా 2022 ఏప్రిల్ 1న “సర్కారు వారి పాట” కొత్త రిలీజ్ డేట్ గా ఖరారు చేశారు మేకర్స్.