![ఎవరు మీలో కోటీశ్వరులు లో ఎన్టీఆర్ తో మహేష్ బాబు](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/ntr-jr-mahesh-babu-evaru-meelo-koteeswarulu-blasting-episode.jpg)
జూనియర్ ఎన్టీఆర్ ఓ వైపు మూవీల్లో బిజీగా ఉంటూనే జెమినీ టీవీలో వచ్చే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఆయన తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఈ షోకు టీఆర్ఫీలను తెచ్చిపెడుతున్నారు. ఇక అది అలా ఉంటే.. ఎన్టీఆర్ షోకి మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు.. టీఆర్పీ రికార్డ్స్ బద్దలుకొట్టాడనికి ఎన్టీఆర్ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తైయింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఎపిసోడ్ త్వరలో రాబోతోందంటూ జెమిని ఛానెల్ వాళ్లు కూడా ప్రకటించారు.
ప్రేక్షకులకు మరింత వినోదం అందించే ఉద్ధేశ్యంలో భాగంగా షో నిర్వాహకులు మధ్య మధ్యలో పలువురు సినీ ప్రముఖులను షోలోకి గెస్టులుగా తీసుకొస్తున్నారు. ఈ షో ప్రారంభించిన మొదటి రోజే రామ్ చరణ్ అతిథిగా తీసుకువచ్చారు. అంతేకాదు ఆయన షోలో ప్రశ్నలకు జవాబులు చెప్పి రూ. 25 లక్షలు గెలుచుకుని అదరగొట్టారు. ఆ తర్వాత తెలుగు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ గెస్ట్లుగా వచ్చి అలరించారు. ఆ తర్వాత సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్, తమన్ ముఖ్య అతిథులుగా హాజరై అలరించారు. మధ్యలో సమంత కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసింది. వీళ్లు అందరూ రూ. 25 లక్షల చొప్పున గెలుచుకున్నారు.
Evaru Meelo Koteeswarulu | Gemini TV
— Gemini TV (@GeminiTV) November 20, 2021
Get ready to watch the episode of the decade soon on Gemini TV. #PoonakaalaEpisodeLoading #EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswaruluOnGeminiTV #EvaruMeeloKoteeswarulu pic.twitter.com/xlrBgnwuLS