వెంకటేశ్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం-2’. 2014లో విడుదలైన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్ నూ తెలుగులో వెంకటేశ్ రీమేక్ చేశారు. అదిప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. ఇందులో రాంబాబుగా వెంకటేశ్, ఆయన సతీమణిగా మీనాల నటన ఆకట్టుకునేలా ఉంది. పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది.. ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. కేస్ ఇన్వెస్టిగేషన్ ఎలా మలుపు తిరిగింది.. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అంటే ఈ మూవీ చూడాల్సిందే..
మరి ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంది ఎలా మెప్పించింది లాంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి..