Akhanda Pre Release Event : నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో రానున్న మూడో మూవీ రిలీజ్కు రెడీగా ఉంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్లు, ఫొటోలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో శిల్పకళ వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాజమౌళిలు గెస్టులుగా వచ్చారు. బోయపాటి శ్రీను తెరకేకించిన సరైనోడు మూవీలో అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ బాలకృష్ణ కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని వెల్లడించారు. ఈనాటి అనుబంధం ఏనాటిదో అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తో తన తాత గారు అల్లు రామలింగయ్యకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని, తన తండ్రి అల్లు అరవింద్, బాలకృష్ణ ఒక తరం వ్యక్తులని, తాను చిరంజీవి, బాలకృష్ణ మూవీస్ చూస్తూ పెరిగానని తెలిపారు.
MAA Elections: నరేశ్ వల్లే ‘మా’లో ఇన్ని గొడవలు – శివాజీ రాజా