![బాలకృష్ణ](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/nandamuri-balakrishna-slams-ysrcp-leaders.jpg)
రాజకీయం రాజకీయనేతల మధ్య ఉండాలి..ఫ్యామిలీ మధ్య కాదు. చట్టసభల్లో ఉండి ఇలాంటి మాటలా.. అసెంబ్లీలో ఉన్నారా..గొడ్ల చావిడిలో ఉన్నారా..అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు బాలకృష్ణ. సభలో ప్రతిపక్షాలను విమర్శించేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాడుతున్న భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రజా సమస్యలపై చర్చించడానికి ఉద్దేశించబడింది మరియు వ్యక్తులను హత్య చేయడం కోసం కాదు అని ఆయన పేర్కొన్నారు. ఇన్నాళ్లూ సహించాం భరించాం..ఎప్పుడైనా ఆవేశం వస్తే చంద్రబాబు ఆలోచించి మమ్మల్ని ఆపేవారు. విర్రవీగి మాట్లాడేవారు ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇక ఆగం..సహించం.
ఫ్యామిలీని టచ్ చేసి చూశారు..మరోసారి..మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు బాలయ్య నందమూరి ఆడవారిని ఎవరైనా మాట్లాడితే..హద్దు మీరి ప్రవర్తిస్తే..నోటికొచ్చినట్లు వాగితే ఖబర్దార్ అంటూ వేలు చూపిస్తూ..వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదని బాలకృష్ణ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధిపై బదులు.. వ్యక్తిగత అజెండా తీసుకువచ్చారని ఫైరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.