సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆరు రోజులుగా ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఐసీయూలో ఎక్మో సపోర్ట్తో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 యేళ్లు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో ఆయన అభిమానులు, శోకసంద్రంలో మునిగిపోయారు. తెలుగు సినీపరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
ఇక కొద్దిసేపటి క్రితమే అయన పార్థివదేహాన్ని అభిమానులు సినీ ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ చాంబర్ కు తరలించారు. రాజమౌళి, కీరవాణి సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించారు. నేడు ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలను నిర్వహించనున్నారు.