IND vs NZ Test Match : ముంబై వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 372 పరుగుల భారీ తేడాతో గెలుపొందింంది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 165 పరుగులు చేసి ఆలౌటైంది. ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ కేవలం 62 పరుగులు చేసి ఆలౌటైంది.
రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 276 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది. తద్వారా న్యూజిలాండ్ కు 540 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ కేవలం 167 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇండియా గెలుపొందింది. ఇండియా బౌలర్ల దూకుడుకు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ నిలవలేకపోయారు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్, జయంత్ యాదవ్ చెరో 4 వికెట్లు తీయగా.. అక్సర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. ఇండియా ఈ విజయంతో సిరీస్ ను 1-0తో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మయాంక్ అగర్వాల్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా అశ్విన్ ఎంపికయ్యారు.