Evaru Meelo Koteeswarulu Best Moments With Mahesh Babu : జెమినీ టీవీ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ స్పెషల్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేసింది, జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఎపిసోడ్ కి మహేష్ బాబు కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. మహేష్ బాబు తన తొలి గేమ్ షోలో కనిపించాడు. మహేష్ బాబు ని ‘అన్నా’ అని స్టేజ్ పైకి పిలిచారు ఎన్టీఆర్. ఇక మహేష్ బాబు మాట్లాడుతూ.. ఇది నాకు ఇష్టమైన షోలలో ఒకటి. నేను దీన్ని చూస్తూ పెరిగాను. ఇది ఒక ఐకానిక్ షో, మరియు మీరు ఈ షోని హోస్ట్ చేస్తున్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. నిజంగా, నిజంగా గర్వంగా ఉందన్నారు.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ తాజా సీజన్ మహేష్ బాబు ఎపిసోడ్తో ముగిసింది. ఈ షోలో సూపర్స్టార్ మహేష్ బాబు కాకుండా, రామ్ చరణ్, సమంతా, దేవి శ్రీ ప్రసాద్, ఎస్ఎస్ రాజమౌళి మరియు కొరటాల శివ వంటి సినీ ప్రముఖులు అతిథులుగా వచ్చారు.