Pawan Kalyan Deeksha : ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్ స్టీల్ప్లాట్ కార్మికులకు సంఘీభావం తెలుపుతూ సినీనటుడు, రాజకీయ నాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు దీక్షలో పాల్గొననున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సహాయ సహకారాలు అందించబోతున్నట్లు జనసేన పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ కళ్యాణ్ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటారు. దీక్షలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొననున్నారు.