MLC Ananthababu : హత్య కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంత బాబుకు ఆయన అభిమానులు పూలమాలలు వేసి ఊరేగించారు. ఇదొక ధోరణిగా మారుతోంది. గుజరాత్లో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి మూడేళ్ల బిడ్డతో సహ తొమ్మిది మంది కుటుంబ సభ్యులను చంపేసిన వాళ్లు జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా ఊరేగింపులు సన్మానాలు చేశారు. హీనమైన నేరగాళ్లకు ఎర్రతివాచీ పరిచే సమాజం ఎటువైపు ప్రయాణిస్తున్నట్టు? దీని వెనుక ఏం పనిచేస్తున్నట్టు? – బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.. ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..