ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. వైసీపీ వర్సెస్ జనసేన మధ్య మాటల తూటాలు పేలుతునన్నాయి. మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఇంతకు ముందు లెక్క వేరు..ఇప్పటిలెక్క వేరు.! అన్నారు పవన్ కళ్యాణ్.. జనసైనికుల సింహ గర్జనలు. వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమని మండిపడ్డారు. వైసీపీ వ్యక్తులకు డబ్బు, అధికారం, అహకారం, మదం పెరిగిందని ఆరోపించారు. వారికి లేనిదల్లా భయం. భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తానంటూ పవన్ హెచ్చరించారు. ఈ సన్నాసులకు, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారం.. నేను నేర్పిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తానన్నారు పవన్ కళ్యాణ్.