Kandukuru Incident : చంద్రబాబు సభలో అపశృతి చోటుచేసుకుంది. ఈ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో తోపులాట జరిగి 8 మంది మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన చంద్రబాబు సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
ఈ తోపులాటలో సుమారు పది మంది కార్యకర్తలు ఒక్కసారిగా పెద్ద కాలువలో పడిపోయారు. ఈ క్రమంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారని చెబుతున్నారు. మరో 6గురు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో కాలువలో పడి గాయపడిన కార్యకర్తలను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో చంద్రబాబు సభను అర్ధాంతరంగా నిలివేశారు. కాగా, ఈ ఘటనలో గాయపడిన వారిని చంద్రబాబు కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి.. క్షతగాత్రులను పరామర్శించినట్టు తెలుస్తోంది.