![bheemla nayak song](https://brighttelangana.com/wp-content/uploads/2021/12/AdaviThalliMaata-Bheemla-Nayak-Songs.jpg)
Bheemla Nayak 4th Song : పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న మూవీ ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ మూవీకి ఇది తెలుగు రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యా మీనన్.. రానా కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ – ఇద్దరు హీరోల గ్లిమ్స్ – టైటిల్ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి కారణంగా వాయిదా పడిన భీమ్లా నాయక్ 4th సింగిల్ ‘అడవి తల్లి మాట’ సాంగ్ ను విడుదల చేశారు. సింగర్స్ కుమ్మరి దుర్గవ్వ, సాహితీ చాగంటి ఈ సాంగ్ ను పాడగా, రామజోగయ్య శాస్ట్రీ లిరిక్స్ అందించారు. సాంగ్ లో ముందుగా దివంగత దిగ్గజ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులు అర్పించారు. అనంతరం సాంగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ లో ఉన్న లిరిక్స్ “చెప్తున్నా నీ మంచి చెడ్డా… తోటి పంతాలు పోమాకు బిడ్డా… చిగురాకు చిట్టడివి గడ్డా… చిక్కుచ్ల్లో అట్టుడికి పోరాదు బిడ్డా” అనే లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి.
ఈ ‘భీమ్లా నాయక్’ మూవీని జనవరి 12నే విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.