![అడివి శేష్ మేజర్](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/Major-On-Feb-11-Adivi-Sesh-Saiee-Manjrekar.jpg)
అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన మూవీ ‘మేజర్’. తాజాగా మూవీ యూనిట్ మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తూ.. ఈ మూవీ రిలీజ్ డేట్ను అఫీషియల్గా కన్ఫామ్ చేశారు. ఈ మూవీను 2022 ఫిబ్రవరి 11న చిరంజీవి, రామ్ చరణ్ల ‘ఆచార్య’ రిలీజైన వన్ వీక్ గ్యాప్లో థియేటర్స్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో సందీప్గా అడివి శేష్ నటించారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో మహేశ్బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ నిర్మించిన మూవీ ఇది.
‘ముంబై 26/11 దాడుల్లో సందీప్ వీరోచిత పోరాటంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ మూవీలో చూపించనున్నాం’ అని మూవీ యూనిట్ పేర్కొంది. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.