![Chiru with PM Modi : భీమవరం వేదికగా ప్రధాని సభకు మెగాస్టార్ కు ఆహ్వానం..](https://brighttelangana.com/wp-content/uploads/2022/06/chiranjeevi-gets-an-invitation-to-pm-modis-event-in-bhimavaram.jpg)
Chiru with PM Modi : భారత ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని ఒక కార్యక్రమానికి అతిథిగా హాజరై ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ప్రత్యేక ఆహ్వానం పంపింది.
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతా రామరాజు 125వ జయంతిని భారత స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (Azaadi ka Amrit Mahotsav) కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం స్మరించుకోనుంది. ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. దశాబ్దం క్రితం చిరంజీవి కూడా యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నారు