![Are these the reasons for the stampede in Chandrababu's road show](https://brighttelangana.com/wp-content/uploads/2022/12/Are-these-the-reasons-for-the-stampede-in-Chandrababus-road-show.jpg)
నెల్లూరు జిల్లాలోని కందుకూరులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రోడ్ షోలో విషాదం చోటు చేసుకుంది. ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో భాగంగా కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు మాట్లాడుతుండగా జరిగిన తోపులాటలో మురుగు కాల్వలో పడి 8 మందిమృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడగా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.