![Big Shock to Chadrababu Naidu in kuppam elections](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/Big-Shock-to-Chadrababu-Naidu-in-kuppam-elections.jpg)
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిని కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అంచనాలను వైసీపీ తలకిందులు చేసింది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టిన అధికార వైసీపీ.. కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి మరోసారి గట్టి షాక్ తగిలింది. ఏకపక్షంగా కుప్పం మున్సిపాల్టీని గెలుచుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కుప్పం మున్సిపాల్టీలో మొత్తం 25 వార్డులు ఉండగా.. ఇరుపార్టీల మధ్య హోరాహోరీగా సాగింది. చివరికి అధికార వైసీపీ పార్టీ విజయం సాధించింది. కుప్పం కూడా వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూసిన కుప్పం మున్సిపల్ ఎన్నిక ఫలితం మొదటి రౌండ్లోనే తేలిపోయింది. మొత్తం 25 వార్డులు ఉండగా 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడంతో మిగిలిన 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన 24 వార్డుల్లో ఇప్పటి వరకు వైసీపీ 13 స్థానాల్లో విజయం సాధించింది. అయితే తాజా కౌంటింగ్ను బట్టి చూస్తే.. నిమిషనిమిషానికి పరిస్థితులు మారిపోతూ వచ్చాయి. కుప్పంలో విజయం సాధించడంతో.. వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.