![nz vs sco t20](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/nz-vs-sco-t20.jpg)
టీ 20 ప్రపంచ కప్ 2021: టీమిండియా ఎన్నో ఆశలు పెట్టుకున్నా నమీబియా జట్టు వాటిపై నీళ్లు చల్లింది. 164 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నమీబియా 52 పరుగుల భారీ తేడాతో చిత్తు అయింది. న్యూజిలాండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి కేవలం 111 పరుగుల మాత్రమే చేయగలిగింది. ఫలితంగా న్యూజిలాండ్ పసికూన నమీబియాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.
నమీబియా ఇన్నింగ్స్లో వాన్ లింగెన్(22), స్టీఫెన్ బార్డ్(21), జేన్ గ్రీన్(23), డేవిడ్ వీస్(17) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. కివీస్ బౌలర్లలో సౌథీ, బౌల్ట్ చెరో రెండు వికెట్లు సాధించగా.. సాంట్నర్, నీషమ్, సోధీ చెరో వికెట్ పడగొట్టారు.