మెగాస్టార్ చిరంజీవి వరుస మూవీలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ మూవీని కంప్లీట్ చేసిన చిరంజీవి.. ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ వంటి మూవీలను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాజాగా భోళా శంకర్ మూవీని షురూ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం గురువారం అన్నపూర్ణ స్టూడియోస్లో వేడుకగా జరిగింది.
తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్గా రూపొందనున్న ఈ మూవీ.. చిరంజీవి కెరీర్లో 155వ మూవీగా రాబోతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించనుండగా.. నవంబర్ 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ అన్నాచెల్లెళ్ల అనుబంధం మీద తెరకెక్కుతోంది. ఈ మూవీలో మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. 2022లో భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రారంభోత్సవం కార్యక్రమానికి దర్శకులు శివ కొరటాల, వంశీ పైడిపల్లి, గోపిచంద్ మలినేని, బాబీ, హరీశ్ శంకర్ విచ్చేశారు. దర్శకులు డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా.. మిగిలిన డైరెక్టర్స్ స్క్రిప్ట్ అందించారు, ఫస్ట్ షాట్కి అనిల్ రాం బ్రహ్మ సుంకర దర్శకత్వం వహించారు.