తెలుగు సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘ఆచార్య’. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రామ్ చరణ్ ‘సిద్ధ’ పాత్ర కి సంబంధించిన టీజర్ విడుదల కాబోతోంది. ఈ నెల 28న ‘సిద్ధసాగా’ పేరుతో ఈ టీజర్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్టు చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవి కానుకగా థియేటర్లలో అలరించాల్సిన ఈ మూవీ.. కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యమవడంతో విడుదల వాయిదా పడింది. తొలుత దసరా కానుకగా తీసుకువస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తి సానుకూలంగా లేకపోవడం, నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
ఇక భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూనే చిత్రంలో ఎంతో కీలకమైన సిద్ద అనే పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
Siddha is a memorable character for many reasons.
— Ram Charan (@AlwaysRamCharan) November 24, 2021
Powerful Teaser is on its way!#SiddhasSaga on Nov 28th.#Acharya #AcharyaOnFeb4th
Megastar @KChiruTweets #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/gUs7iiJOaK