![జీ 5 ఓటీటీ రిపబ్లిక్ మూవీ](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/sai-dharam-tej-watching-republic-movie-on-ott-platform.jpg)
సాయి తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ‘జె.బి.ఎంటర్టైన్మెంట్స్’ ‘జీ స్టూడియోస్’ బ్యానర్ల పై జె.భగవాన్, జె.పుల్లారావు లు కలిసి నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 1న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ.. కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.ఇక ఫుల్ రన్లో ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.
అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజుకు తీవ్ర గాయాలు కావడంతో.. సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లి హిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీపావళి పండగ రోజున సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నడంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు చిరంజీవి.
ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఓటీటీ వేదికగా విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 రిపబ్లిక్ మూవీని స్ట్రీమింగ్ చేస్తుంది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ దర్శక నిర్మాతలతో కలిసి ఓటీటీలో వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇటీవల సాయి తేజ్ ఓ ఆడియో మెసేజ్ కూడా విడుదల చేశారు. “రిపబ్లిక్ మూవీని థియేటర్లో మీతో కలిసి చూడటం కుదరలేదు, కానీ ఆ మూవీ ఓటీటీలో విడుదల అవుతోందని పేర్కొన్నారు. అందరు మూవీని చూసి స్పందించాలని కోరారు సాయి ధరమ్ తేజ్.
Celebrating the success of #REPUBLIC for REAL with my dearest brother @IamSaiDharamTej 🤗🤗 https://t.co/wtToOnoc9P pic.twitter.com/kGbkMZVnvQ
— dev katta (@devakatta) November 26, 2021