జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 8న విడుదలయ్యింది. వరల్డ్ వైడ్ గా 720 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేశారు అయితే మొదటి షో తోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ మూవీ పెద్దగా పట్టించుకోలేదు.వీకెండ్ వరకు సో సోగా రాణించిన… కలెక్షన్లు పెద్దగా నమోదుకాలేదు.
కొండపొలం మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ షేర్ :
నైజాం | 0.98 cr |
ఉత్తరాంధ్ర | 0.65 cr |
సీడెడ్ | 0.44 cr |
ఈస్ట్ | 0.36 cr |
వెస్ట్ | 0.27 cr |
గుంటూరు | 0.39 cr |
నెల్లూరు | 0.20 cr |
కృష్ణా | 0.30 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 3.59 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.31 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 3.90 cr |
‘కొండపొలం’ మూవీకి రూ. 7.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.3.90 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకు రూ.4 కోట్ల వరకు నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది.